telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్..

pawan

జనసేనకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తెలంగాణలో జరుగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) లు.. తమ కామన్ గుర్తులను కోల్పోయాయి. గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లకు పోటీ చేయని తరుణంలో జనసేన కామన్ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నిర్ణయంతో కంగుతిన్న జనసేన.. ​గ్రేటర్ ఎన్నికల్లో బిజేపి తో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు తెలిపారు. త్వరలో జరిగే రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలలో తాము పోటీ చేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు గాజుగ్లాస్ కామన్ సింబల్ ను కొనసాగించాలని ఎస్ఈసి ని కోరారు. అయితే జనసేన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తిరస్కరించారు. దీంతో 2025 నవంబర్ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని పేర్కొనారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్.

Related posts