ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చాలా కీలకంగా మారారు. అయితే ఆయన కు తాజా గా స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. ఆయన కంటికి ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలకు నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాల ఎన్నికల కమిషన్ సమాచారం అందించింది. రేపోమాపో ఏకగ్రీవం అయిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఏకగ్రీవాలను ప్రకటించొద్దని కలెక్టర్లకు ఆదేశించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజాగా ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
previous post
next post