telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

టాలీవుడ్‌లో మరో విషాదం…

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ కోలా భాస్కర్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలా భాస్కర్ గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసారు. కోలా భాస్కర్ కు భార్య, కుమారుడు ఉన్నారు. కోలా భాస్కర్ తెలుగులో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా కోలా భాస్కర్ పనిచేసిన వాటిలో పవన్ కళ్యాణ్ భూమికల కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి సినిమాకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఇంకా ఆయన ఎడిటర్‌గా 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాడు. ఇక కోలా భాస్కర్ కుమారుడు కోలా బాలకృష్ణ హీరోగా నిన్ను వదిలి నేనుపోలేనులే అనే సినిమాను చేశాడు. సెల్వ రాఘవణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ స్వయంగా నిర్మించాడు. కోలా భాస్కర్ అకాల మరణంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Related posts