తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ రంగంలోకి దిగింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5కోట్లును ముఠా కొల్లగొట్టిన విషయం తెలసిందే. ఆ దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచారనే కోణంలో దర్యాప్తు చేయనుంది.
అలాగే..తెలుగు అకాడమీలో డిపాజిట్ల మళ్లింపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తూ దర్యాప్తు చేయాలని సీసీఎస్ పోలీసులు ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. తెలుగు అకాడమీకి చెందిన నిధులను నిందితులు పక్కా స్కెచ్ వేసి డ్రా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
నిధుల గోల్మాల్ లో బ్యాంకు అధికారులతో పోటు అకాడమీకి చెందిన ఉద్యోగుల పాత్రను కూడ పోలీసులు దర్యాప్తులో తెలుసుకొన్నారు. అకాడమీ నుండి కొల్లగొట్టిన డబ్బులతో నిందితులు స్థిరాస్తులు కొనుగోలు చేశారని గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే 11 మందిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరికొందరు అనుమానితులకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఆధారాలు లభిస్తే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. దీంతో మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయనుంది.
అలాగే ..తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను కలర్ జిరాక్స్ తీసి ఫోర్జరీ చేసిన పద్మనాభన్ను కోయంబత్తూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి, భూపతి, యోహన్, రమణారెడ్డి పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఫోర్జరీరీ డాక్యుమెంట్లు, ఫేక్ అకౌంట్స్, ఐడీలు నిందితులు సృష్టించారు. మరోవైపు నేడు మూడవ రోజు కస్టడికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ హాజరుకానున్నారు. అయితే అరెస్ట్ అయిన ఇతర నిందితులను సైతం పోలీసులు కస్టడికి కోరారు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి