కాంగ్రెస్ నేత పంజాబ్ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీహార్లోని కతిహార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్దు చేసిన ప్రసంగం పై ఈసీ స్పందించింది. ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్దూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఆయనకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సిద్దూను ఆదేశించింది.