తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు రాత్రింభావళ్ళు గాలింపు జారుపుతున్నారు. ఆదివారం పాపికొండలులో పర్యాటక బోటు ‘రాయల్వశిష్ఠ’ మునిగిపోయి, 72 గంటలు దాటిపోయింది. ఆ సమయంలో 73 మంది బోటులో ఉన్నారు.
ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. ఈ దుర్ఘటనలో ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు