telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

మరో ఐదు మృతదేహాలు గుర్తింపు… 31కి చేరిన మృతుల సంఖ్య

tourisam boat

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు రాత్రింభావళ్ళు గాలింపు జారుపుతున్నారు. ఆదివారం పాపికొండలులో పర్యాటక బోటు ‘రాయల్‌వశిష్ఠ’ మునిగిపోయి, 72 గంటలు దాటిపోయింది. ఆ సమయంలో 73 మంది బోటులో ఉన్నారు.

ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. ఈ దుర్ఘటనలో ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు.

Related posts