telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుడిగుండంలో చిక్కుకోవడం వల్లే బోటు ప్రమాదం: మంత్రి కన్నబాబు

minister kannababu

తూర్పు గోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ఘటనపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి నదిలో మునిగిపోయిన బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందని వెల్లడించారు. అయితే వరద ఉద్ధృతితో బోటు సుడిగుండంలో చిక్కుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని వివరించారు. దీనిపై చంద్రబాబు వంటి నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

ప్రమాదంలో ఆచూకీ లేని వారికి మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. బోటు ప్రయాణాలపై మాన్యువల్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. ఇకమీదట బోట్లలో జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు ఉంటేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చే ఆలోచన ఉందని పేర్కొన్నారు.

Related posts