telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

బోటు ప్రమాదం ఘటన కేసులో మరో ఇద్దరు అరెస్టు

tourisam boat

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కచులూరు వద్ద బోటు మునిగిపోయిన ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మంది ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బోటు ప్రయాణాలను నిర్ణయించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని తేలడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 77 మంది ప్రయాణించగా 26 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బోటు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, పోర్టు అధికారులు ఇచ్చిన సర్క్యులర్‌ ఆధారంగా బోటు ప్రయాణాలను ప్రారంభించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గేడా వీరవెంకటరమణ సత్యనాగమురళి (జలశ్రీ మురళి), సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఏపీ బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రాజారావులను నిన్న అరెస్టు చేసి రంపచోడవరం మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచారు.

Related posts