telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా వైరస్ ప్రభావం.. ఈ-వీసా నిలిపివేసిన భారత్..

e-visa cancelled by indian embassy in china

కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చైనీయులు…చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. చైనాలో ప్రాణంతక కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్‌ నగరం నుంచి అరు వందల మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించింది. భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకొనే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వసాయి’ అని తెలిపింది బీజింగ్‌లోని భారత ఎంబసీ. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు.. బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని కానీ లేదా షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లను గానీ, భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదించవచ్చునని సూచించింది. మరోవైపు కరోనా వైరస్‌ బారిన పడి చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మృతిచెందారు. అలాగే 14 వేల 5 వందల 62 మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. అందులో భారత్‌ కూడా ఉంది. భారత్‌లో రెండు కరోనా వైరస్‌ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

Related posts