దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో, కేంద్రం మే 4 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇకపై గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు విక్రయించుకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు. తమకు అన్ని రకాల వస్తువులు విక్రయించే వెసులుబాటు కల్పించాలని పలు ఈ-కామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది.
అప్పులన్నీ తమపైకి నెట్టి.. టీడీపీ విమర్శలకు దిగుతోంది: మంత్రి బుగ్గన