telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

స్ట్రాంగ్ రూమ్ లోనే.. ఏజెంట్ లు ఉండిపోవచ్చు.. : ద్వివేది

ap election officer altered

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై అనుమానాలు అవసరం లేదని అన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని.. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం తమ ఏజెంట్లను స్ట్రాంగ్‌రూమ్‌ కంట్రోల్‌ రూమ్‌లలో 24 గంటలూ ఉంచవచ్చని ద్వివేది చెప్పారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతపై పుకార్ల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండవని.. వైఫై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారనే ప్రచారంలో నిజం లేదని ద్వివేది స్పష్టం చేశారు. ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఉండేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్‌రూమ్‌లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని చెప్పారు. అటువంటి పుకార్లను ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని ద్వివేది వివరించారు.

Related posts