నటుడు శివాజీ దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో మరోసారి చుక్కెదురైంది. దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు శివాజీని అడ్డుకున్నారు. శివాజీ అమెరికా వెళ్లే ప్రయత్నంలో దుబాయ్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ విభాగంలో తనిఖీల కోసం ఆగినప్పుడు శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించిన దుబాయ్ అధికారులు అమెరికా వెళ్లేందుకు నో చెప్పారు. అంతటితో ఆగకుండా, శివాజీని తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిందిగా సూచించారు.
గతంలో ఇలాంటి అనుభవమే శివాజీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసులో శివాజీపైనా ఆరోపణలున్న సంగతి తెలిసిందే. శివాజీపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రస్తుతం శివాజీపై ఉన్న ఆంక్షలను పోలీసులు తొలగించినా, దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రం అనుమతించలేదు.