telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరూ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి… కరోనా విజృంభనపై మహేష్

mahesh-babu

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మనల్ని మనం కాపాడుకునే సమయం ఇది. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చుట్టుపక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. కోవిడ్ పాజిటివ్ ఉన్న ఎవరైనా మీకు దగ్గరగా వచ్చినా అలర్ట్ చేస్తుంది. ఆరోగ్య భద్రత, అత్యవసర సేవలను సులభంగా పొందొచ్చు. అందరం భద్రతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి’’ అని తన పోస్ట్‌లో మహేష్ పేర్కొన్నారు.

Related posts