అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లోనూ ఆయనకు నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫలితాలను ఇచ్చే అబాట్ లాబరేటరీ ప్రవేశపెట్టిన నూతన పద్దతి ద్వారా ఆయన ఈ పరీక్ష చేయించుకున్నారు.
ఈ పద్దతి ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్టు కోసం పది గంటలు వేచి చూశారు. దీంతో ఈసారి ర్యాపిడ్ విధానంలో చేయించుకుని పావుగంటలోనే రిపోర్టు అందుకున్నారు.