భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్కు మోదీ పరిచయం చేశారు. అనంతరం, రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధిని దర్శించి నివాళులర్పించేందుకు ట్రంప్ దంపతులు వెళ్లారు.