భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం పొందిన వారి జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు.
అయితే ఈ ఆహ్వానాన్ని మన్మోహన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు. తాను విందుకు రాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేస్తూ.. మన్మోహన్ రాష్ట్రపతి భవన్కు సమాచారం అందించారు. ఈ విందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించకపోవడంతో.. ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇక ట్రంప్కు ఇచ్చే విందులో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు