ఒకపక్క పిల్లలు కలగక తిరగని గుళ్ళు లేక అల్లాడుతున్న వారు, మరోపక్క కన్నాక నెలలు నిండని పసికందును చెత్తకుప్పలో పడేశేవారు. ఇంకేముంది, ఆకలిగొన్న కుక్కలు ఆ శిశువును పీక్కుతిన్నాయి. ఈ సంఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్ప వద్ద కుక్కలు నెలలు నిండని పసికందును పీక్కుతింటున్న దృశ్యాలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ పసికందు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుక్కలను తరిమికొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.