telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిద్రమాత్రలు మింగి ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం..

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడేక్కాయి. ఆ రాష్ట్రంలోని డీఎంకే నేతల్లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పార్టీ అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటీవల కడయంలో జరిగిన డీఎంకే సమావేశంలో తెన్‌కాశి జిల్లా డీఎంకే శాఖ కార్యదర్శి శివ పద్మనాభన్‌తో ఆమె గొడవ పడ్డారని.. దీంతో ఆమె విరక్తి చెంది నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిసింది. కడయం సభలో ఆలడి అరుణా పూంగోదైకి, తెన్‌కాశి డీఎంకే జిల్లా కార్యదర్శి శివపద్మనాభన్‌కు మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమేనని ఆలకుళం పోలీసు ఇన్‌ స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే.. ఈ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారా లేదా కచ్చితంగా తెలియడం లేదని.. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts