telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దివీస్ పరిశ్రమకు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ

దివీస్ ల్యాబరేటరీస్ కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయొద్దని దివీస్ కు పరిశ్రమల శాఖ ఆదేశించింది. దివీస్ పరిశ్రమకు స్థలం ఇచ్చిన ప్రాంతంలో అనేక హెచరీస్ ఉన్నాయని పేర్కొన్నారు పరిశ్రమల డైరెక్టర్ జేవిఎన్ సుబ్రమణ్యం. హెచరీస్ కారణంగా గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని లేఖలో పేర్కొన్న డైరెక్టర్. వ్యర్థాల కారణంగా వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపింది పరిశ్రమల శాఖ. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ఉండడం సరికాదని డైరెక్టర్ వెల్లడించారు.

Related posts