telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎక్కువ పారితోషకానికి ఆ సినిమా ఒప్పుకున్నా దిశా పటానీ..

Disha

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ బాలీవుడ్ పై కనేసారు. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ తరువాత వైవిధ్యమైన కథలతో అలరించారు. అయితే తాజాగా బెల్లంకొండ… రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఛత్రపతితో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసేందుకు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ కు వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో చేసేందుకు హీరోయిన్స్ ఎవరు ముందుకు రావట్లేదని సమాచారం. అంతేకాకుండా మూవీ మేకర్స్ బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, అనన్య పాండే, శ్రద్దా కపూర్ తదితరులను సంప్రదించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదని సమాచారం. కానీ ఇప్పుడు బెల్లంకొండకు భామ దొరికేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లోకి లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఈ సినిమాకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. మొదట దిశా పటానీ కూడా నో చెప్పిన తర్వాత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఓకే చెప్పిందంట..! కానీ దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సినిమాను హిందీలో పెన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.

Related posts