telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దిశ బిల్లులో సాంకేతిక లోపాలు..వెనక్కి పంపిన కేంద్రం

cm jagan on govt school standardization

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే, బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచిస్తూ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులోని 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా లేవని, వాటిని సరిచేసి మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది.

దీంతో సాంకేతిక అంశాలను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు, ఈ నెల 7న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఆదికవి నన్నయ యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్ ను ప్రారంభించనున్నారు.

Related posts