దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లకు అనుమతులు దొరికినా ఎవ్వరూ సాహసించడం లేదు. ఇక రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడప్పుడే షూటింగ్స్ జరిగేలా కనిపిచండం లేదు. దీంతో రాజమౌళి తన ఫాంహౌజ్కు మకాం మార్చినట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఎదులూరు గ్రామంలో రాజమౌళి భారీ ఫాంహౌజ్ను నిర్మించుకున్నా డు. ఆర్ఆర్ఆర్ షూట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో… కొంతకాలం ఫాంహౌజ్ లోనే ఉంటూ స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నాడట జక్కన్న.
previous post