“సాహో” తరువాత ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కెకె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న ఒకే ఒక్క దక్షిణాది హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన `సాహో` సినిమా మిగిలిన అన్ని భాషల్లోనూ పరాజయం పాలైనా.. బాలీవుడ్లో మాత్రం హిట్ అనిపించుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో `ధూమ్-4`లో నటించే అవకాశం ప్రభాస్కు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం కమల్హాసన్తో `ఇండియన్ 2` సినిమా చేస్తున్న ఆయన తదుపరి ప్రభాస్తో సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే మరో వర్గం మాత్రం శంకర్ తన తదుపరిని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తోనే చేస్తాడని అంటుంది. మరి నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్స్టోరీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
previous post