telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజాకార్ల నేపథ్యంలో.. చిరు కోసం కథను సిద్ధం చేస్తున్న దర్శకుడు

chiru

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కొంతవరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లో చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై దర్శకుడు సుజీత్ కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చిరంజీవిని ఒప్పించే పనిలో దర్శకుడు సంపత్ నంది వున్నాడని అంటున్నారు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో సంపత్ నంది ఒకరు. చాలా కాలం క్రితమే చరణ్ తో ‘రచ్చ’ చేసిన ఈ దర్శకుడు, చిరంజీవితో చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రజాకార్ల నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా సంపత్ నంది ఈ కథను సిద్ధం చేసుకున్నాడట. త్వరలో చిరంజీవికి వినిపించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఆయన ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన చిరంజీవిని కలిసే అవకాశం వుంది.

Related posts