టాలీవుడ్ దర్శకుడు రాజ్ కిరణ్కి స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆయన్ని వెంటనే కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. మరో రెండు రోజులలో ఆయనని డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం. రాజ్ కిరణ్ తాజా చిత్రం “విశ్వామిత్ర” ఈ నెల 14న విడుదల కానుంది. ఇందులో నందిత రాజ్ ప్రధాన పాత్ర పోషించారు. గతంలో ఆయన గీతాంజలి, త్రిపుర, లక్కున్నోడు వంటి చిత్రాలని తెరకెక్కించారు.
previous post