పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ రామ్ కెరీర్లో తొలిసారి 40 కోట్ల షేర్కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాగా.. తాజాగా ఈ సినిమా నుంచి “దిమాక్ ఖరాబ్” సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూట్యూబ్లో సంచలనాలు రేపుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ను యూట్యూబ్లో 30 మిలియన్స్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తోంది. ఇస్మార్ట శంకర్ మూవీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టుతో రామ్ తన నెక్ట్స్ మూవీ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తీస్తున్నాడు. గతంలో వీరద్దరి కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ప్రేమకథా సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా క్రైమ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హిట్ ‘తడమ్’కి తెలుగు రీమేక్గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
previous post
next post