telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో వివాదంలో కంగనా రనౌత్‌..

Kangana

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. కంగన మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ విషయం సంచలనంగా మారింది. శివసేన నేతలకు దీటుగా కంగన సైతం కామెంట్లు చేసింది. సంచలన కామెంట్లతో కంగనా వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే… తాజాగా మరో వివాదానికి తెరలేపింది కంగనా. కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలకు సంబంధించిన ఓ వీడియోలో సిక్కు మహిళను చూపిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. “డబ్బులకు ఆశపడి ఓ సిక్కు వృద్ధ మహిళ నిరసన తెలపడానికి వచ్చింది. ఆ వీడియోలో ఉన్న మహిళ షహీన్‌ బాగ్‌లో అల్లర్లకు కారణమైన బిల్కిస్‌ బానో. భారతీయ ప్రతిష్టతను పాక్‌ మీడియా హైజాక్‌ చేసింది. మనపై బురద జల్లడానికి చేసిన ప్రయత్నాలను ఎండగట్టాలి” అంటూ కామెంట్‌ చేసింది. అయితే.. కంగనా వ్యాఖ్యలపై బాలీవుడు యువ హీరో దిల్‌ జిత్‌ దోసాన్హా మండిపడ్డాడు. “బిల్కిస్‌ బానో కాదు.. వీడియోలో కనిపిస్తుంది మహిందర్‌ కౌర్‌. మన తల్లులు దేవుళ్లతో సమానం. అలాంటి వారిపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిందర్‌ కౌర్‌ ఒక రైతు. ఆమె రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయకండి. ఇలా ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం తప్పు. ” అని దిలిజిత్‌ చెప్పుకొచ్చారు.

Related posts