ప్రస్తుతానికి క్రికెట్ ప్రపంచం అంతా వికెట్కీపర్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ చుట్టే తిరుగుతోంది. వచ్చే నెలలో మొదలు కానున్న విండీస్ పర్యటనకు ధోనీ జట్టులో ఉంటాడా.. లేదా? అసలు ధోనీ భవిష్యత్తేంటి? రిటైరవుతాడా.. కొనసాగుతాడా? అనే అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా క్రీడా విశ్లేషకులు, అభిమానులు మిస్టర్ కూల్ రిటైర్మెంట్పై భిన్న రీతుల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ జగ్దల్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ భారత్ కోసం నిస్వార్థంగా ఆడిన గొప్ప ఆటగాడు అతను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయగల సరైన వికెట్కీపర్ బ్యాట్స్మెన్ టీమిండియాకు లేరు. ఇక క్రికెట్లో కొనసాగాలా వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే పరిపక్వత తనకి ఉంది. అసలు తన మదిలో ఎలాంటి ఆలోచన ఉందో సెలక్టర్లు ముందుగా సంప్రదించి తెలుసుకోవాలి. భవిష్యత్తులో అతని నుంచి ఏం కోరుకుంటున్నారో అనే విషయాన్ని కూడా ప్రస్పుటంగా వివరించాలి.