శ్రీనంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దర్పణం. క్రాంతి కిరణ్ వెల్లంకి, వి.ప్రవీణ్ కుమార్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో తనిష్క్రెడ్డి, ఎలక్సియస్, సుభాంగి నటిస్తున్నారు. రామకృష్ణ. వెంప దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రామానాయుడు స్టూడియోస్లో చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు.
విలేకరుల సమావేశంలో…రమణరెడ్డి మాట్లాడుతూ… ఈ చిత్రంలో చాలా కష్టపడి ఇష్టపడి చేశాము. నేను ఈ చిత్రంలో ఒక క్యారెక్టర్ని చేశాను. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఈ చిత్రంలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్గారికి బాగా డబ్బులు రావాలని ఆయన మరిన్ని సినిమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే