టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నాగ్ కేవలం 15 నిమిషాల పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నాగ్ పాత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ అనే భారీ మల్టీస్టారర్లో నటించడానికి ఒప్పుకున్నాడు నాగ్. శరత్ కుమార్, ఎస్జే సూర్య, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోయే ఈ సినిమాని తెండాల్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రెండేళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే, తొలి షెడ్యూలు షూటింగ్ అయ్యాక ఈ చిత్రం ఆగిపోయింది. ఆ చిత్రం బడ్జెట్ సమస్య కారణంగా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ధనుష్ ప్లాన్ చేశారు. ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.