అనీల్ కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, ఓంపురి, సోనూ సూద్, గుల్షన్, ఇర్షాన్, అమైరా దస్తూర్ లాంటి ఇండియన్ నటీనటులు అదృష్టం కలిసొచ్చి హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ తమిళ హీరో ధనుష్ కూడా ” ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్” అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన “ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్” పుస్తకం ఆధారంగా కెనడియన్ స్క్రిప్ట్ రైటర్ కమ్ డైరెక్టయర్ కెన్ స్కాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్తో జతకట్టారు. ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇండియాలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని పక్కిరి అనే టైటిల్తో విడుదల చేయనున్నారు. జూన్ 21న దేశ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.
previous post
పదిహేనేళ్ల క్రితం నుంచే ఆలియా అంటే ఇష్టం : రణబీర్ కపూర్