telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రారంభమైన ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్…

కార్తి హీరోగా సెల్వ రాఘవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆయిరతి ఒరువన్‌’. ఈ సినిమా తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో డబ్ అయ్యింది. యాక్షన్‌ ఎడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పదకొండేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ ను తెరకెక్కిస్తున్నాడు సెల్వ రాఘవన్. అయితే కార్తీ స్థానంలో అతని తమ్ముడు ధనుష్ ఇందులో నటిస్తుండటం విశేషం. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించినట్టు నిర్మాత కలైపులి థాను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సెల్వరాఘవన్ 12వ సినిమాకు తానూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని, తొలిసారి ఆయన చిత్రాన్ని నిర్మిస్తున్నానని థాను తెలిపారు. జనవరి5న మొదలైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయమే పడుతుందట. అందుకే 2024లో ఇది రిలీజ్ అవుతుందని ఇప్పుడే చెప్పేశారు. అన్నదమ్ములైన సెల్వ రాఘవన్, ధనుష్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు రాగా.. ఇది ఐదవది!

Related posts