తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పట్టే అవకాశముందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నేడు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ‘టీటీడీ సేవా ఆన్ లైన్’ను పరిశీలిస్తే, ఈ నెల 17వ తేదీ నుంచి రూమ్ లు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. రోనా భయంతో ముందుగా గదులను తీసుకున్న భక్తులు, వాటిని రద్దు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. వారాంతాల్లో తప్పించి, మిగతా రోజుల్లో గదుల్లో దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించడం లేదు.
కుట్రలు చేయొద్దని కేసీఆర్కు నటుడు శివాజీ విజ్ఞప్తి