పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఏపీలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూములు, వారికి ప్రభుత్వం ఇచ్చే సెంటు పట్టా భూముల కొనుగోళ్లలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పేదలకు పట్టాల పేరుతో ఆవలో కోట్ల రూపాయలు పెద్దలు దండుకున్నారన్నారు. 7 లక్షల రూపాయల విలువగల భూమికి 45 నుండి 62 లక్షల రూపాయల చెల్లించినట్టు ఆరోపించారు. అక్రమాల్లో అధికారపార్టీ నేతల హస్తం ఉందని దుయ్యబట్టారు. అక్కరకురాని అంతధర లేని భూములే ఎంపిక చేసి, ఇప్పటికే వందల కోట్ల రూపాయలు నేతల జేబుల్లోకి వెళ్ళాయని అన్నారు.