రాష్ట్రంలో రైతు సమస్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఏపీలో సుబాబుల్, జామాయిల్ ధరలు భారీగా పడిపోయాయని ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధరలు తక్కువ వస్తుండడంతో రైతులు తోటలు తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతుల కష్టాలను అందులో తెలిపారు.
‘దిక్కు తోచని స్థితిలో సుబాబుల్, జామాయిల్ రైతు. చంద్రబాబు నాయుడి హయాంలో టన్నుకు 4,200 వరకు అమ్మిన రైతుకు నేడుదక్కేది టన్నుకు 900 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. రైతులను దోపిడీ చేస్తున్న దళారులు, అయినకాడికి అమ్మి తోటలు తొలగిస్తున్న రైతులు. 2015 ధరల ప్రకారం 4,200కి మార్కెట్ కమిటీలు కొనుగోలు చేయాలంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా? అని దేవినేని సీఎం జగన్ ను ప్రశ్నించారు.
జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు