నదీజలాల వ్యవహారంలో సొంతంగా ప్రకటనలు చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. వారిద్దరే నిర్ణయం తీసుకోవడానికి ఇదేమీ వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు. విభజన చట్టం ప్రకారం నదీజలాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందని, అయితే ఈ మండలిని జగన్, కేసీఆర్ లెక్కలోకి తీసుకోకుండా సొంత వ్యవహారంలా నదీజలాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.
చట్టప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటాపై ప్రశ్నించని జగన్, పొరుగు రాష్ట్రం నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఎందుకు కోరడంలేదని నిలదీశారు. వ్యవసాయదారులు, ప్రజల హక్కులు సంరక్షించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని, కానీ జగన్ బచావత్ ట్రైబ్యునల్ అంశాలపై ఒక్కసారి కూడా చర్చించలేదని ఆరోపించారు.
జగన్ స్క్రిప్ట్ నే వైసీపీలో చేరిన టీడీపీ నేతలు చదువుతున్నారు: దేవినేని