telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా జగన్ కు రూ. 1000 కోట్లు: దేవినేని

Minister Devineni uma fire ys jagan
తెలంగాణ సీఎం కేసీఆర్  రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు రూ. 1000 కోట్లు పంపించారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్, ఆంధ్రా ద్రోహి అని అన్నారు. ఇద్దరు  ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరంపై మోదీ చేసిన వ్యాఖ్యలను  దేవినేని ఖండించారు. మోదీ ఒక్కసారైనా ప్రాజెక్టును సందర్శించారా? అని ప్రశ్నించారు. పోలవరం చంద్రబాబుకు ఓ ఏటీఎం అని  అనడం ఆయన బాధ్యతారాహిత్యమని అన్నారు. 
పోలవరం ప్రాజెక్టును ఆపాలని టీఆర్ఎస్ కేసులు వేసినప్పటికీ జగన్ కేసీఆర్ తో చేతులు కలిపారని మండిపడ్డారు. ఏపీ ప్రజలను అవమానించిన మోదీకి, జులై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు అందించి చూపిస్తామని దేవినేని నెహ్రూ చెప్పారు. ఏపీ సర్కారు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కేంద్రం నుంచి రూ. 4,483 కోట్లు రావాల్సి వుందనన్నారు. ,రాష్ట్రాభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts