మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ… కొడాలి నాని, తాడేపల్లి రాజ ప్రాధానికి మధ్య వాటాల తేడా వల్లే గుడివాడ పేకాట శిబిరాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కి దమ్ము ధైర్యం ఉంటే కోడాలి నాని ని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుడివాడ మార్కెట్ యార్డు డైరెక్టర్ ఉంటే రాజకీయాలతో సంబంధం లేదని అనడం హాస్యాస్పదంమని ఆయన అన్నారు. మంత్రి కోడాలి నాని చైర్మన్ గా ఉన్న మార్కెట్ యార్డులో డైరెక్టర్, మురళి సోసైటి చైర్మన్ లు పేకాట శిబిరాలు నిర్వహింస్తుంటే మంత్రి ఎలా తప్పించుకుంటాడు ? అని ఆయన ప్రశ్నించారు. పేకాట, లోపల బయట ఆట వల్ల ఎంతో మంది ఆత్మహత్య లు చేసుకున్నారు దీనిపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గుడివాడ సంక్రాంతి సంబరాలకు వచ్చి నాని అన్నఅంటూ ప్రోత్సహించ బట్టే ఇన్ని నెలలుగా ఈ పేకాట దందా కోనసాగుతుందని ఆయన అన్నారు. పోలీసులు డబ్బులు పెట్టుకున్న డబ్బులు చెప్పే విషయంలోనే ఏం జరిగిందో ప్రజలకు అర్థం అయ్యిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారు భారత్ అనే నేను సినిమా చూడటం కాదు జగన్ అనే నేను ప్రమాణం చేయడం కాదు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
previous post
పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులగా మార్చారు: నారా లోకేష్