telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన దేవెగౌడ..

కాంగ్రెస్‌ పార్టీపై జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య నాయకత్వంలో జేడీఎస్‌ను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని ఎవరూ నాశనం చేయలేరని పేర్కొన్నారు. జేడీఎస్‌కు బలమైన మూలాలున్నాయని.. సొంతంగా నిలబడగలుగుతుందని స్పష్టం చేశారు. 2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. తాను ఉన్నంత కాలమే కాదు, తర్వాత కూడా జేడీఎస్‌ సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. ఉత్సాహం, విశ్వాసం ఉన్న కార్యకర్తలు తమకు అండగా ఉన్నారని పార్టీని బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో జేడీఎస్‌ విలీనమవుతుందనే వదంతులను కొందరు తమ పుకార్లు రేపుతున్నారని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాగా.. కర్ణాటకలో ఏడాదిన్నరపాటు అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య విభేధాలు వచ్చాయి. పార్టీ నేతలు గత కొంత కాలంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.,.

Related posts