telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశ రాజధానిని వణికిస్తోన్నచలి..58 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..

ఢిల్లీలో ఓ వైపు ప్రాణాంతక మహమ్మారి “కరోనా”, మరో వైపు కాలుష్యం….ఇక ఇప్పుడు చలి కూడా తోడైంది. నెమ్మదిగా విజృంభిస్తున్న చలి తో దేశ రాజధాని నగరవాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబరు నెల అత్యల్ప ఉష్ణోగ్రత లు నమోదైన విషయంలో రికార్డ్ సృష్టించింది. గత 58 ఏళ్ల లో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబరు నెలలో దేశ రాజధాని లో  అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయు. ఢిల్లీలో గత గురువారం ( అక్టోబరు 26 వ తేదీ) 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఢిల్లీలో, 1994 సంవత్సరంలో అక్టోబరు 31 వ తేదీన 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 1962 , అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అలాగే, ఢిల్లీ లో 1937 సంవత్సరంలో అక్టోబరు 31 వ తేదీన “ఆల్-టైమ్” అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని నగరంలో 1937 వ సంవత్సరంలో అక్టోబరు 31 వతేదీన 9.4 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో నిన్న ఆదివారం (నవంబరు 1) ఉదయం అసాధారణ రీతిలో 11.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.  ఈ సీజన్ లో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఇది రికార్డ్ కావడం విశేషం.

Related posts