telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీ జైలులో కరోనాతో ఖైదీ మృతి

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ కరోనా వల్ల మృతి చెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మాండోలి జైలులో ఉన్న 62 సంవత్సరాల ఖైదీ కరోనా వైరస్ వల్ల మరణించినట్లు జైలు అధికారి పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ జైలులో తొలి కరోనా మరణం నమోదైనట్లు అధికారి చెప్పారు. 2016లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కన్వర్ సింగ్ జూన్ 15న మరణించాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Related posts