దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఓ గోదాములో శనివారం సాయంత్రం ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇంజనాయిల్ గోడౌన్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 22 ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి పంపించింది. పొగలు ఆకాశంలో దట్టంగా అలుముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడు: బీజేపీ నేత లక్ష్మణ్