telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే…?

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో కెప్టెన్ మయాంక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఆరోగ్య సమస్యల కారణంగా రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) అలాగే ఆ తర్వాత వచ్చిన గేల్(13) కూడా త్వరగా ఔట్ కావడంతో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలన్(26) మయాంక్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేసాడు. కానీ మలన్ ఔట్ అయిన తర్వాత అప్పటివరకు నెమ్మదిగా ఆడిన మయాంక్ దూకుడు పెంచాడు. వరుస బౌండరీలు బాదుతూ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచినా మయాంక్(99) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. దాంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడా మూడు వికెట్లు తీయగా అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 167 పరుగులు చేయాలి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts