telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మహానటి”కి దీపికా పదుకొనె ఫిదా

Mahanati

లాక్‌డౌన్ కార‌ణంగా ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇళ్ళలోనే ఉంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్‌తో క‌లిసి ఇంటికే ప‌రిమిత‌మైంది. వంట ప‌నులు చేస్తూ ఖాళీ దొరికిన‌ప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తుంది. రీసెంట్‌గా మ‌హాన‌టి చిత్రాన్ని వీక్షించింద‌ట‌. సావిత్రి జీవిత నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని వీక్షించిన దీపిక‌… “ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క ఈ సినిమాని చూడండి” అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వెంట‌నే స్పందించిన నాగ్ అశ్విన్… “తెల్ల‌వారుజామున కూల్ నోటిఫికేష‌న్‌తో నిద్ర లేచాను” అని కామెంట్ పెట్టారు. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మ‌హాన‌టి చిత్రాన్ని నాగ్ అశ్విన్‌ తెరకెక్కించ‌గా, ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.

Related posts