telugu navyamedia
సినిమా వార్తలు

“భారత్ కీ లక్ష్మి” బ్రాండ్ అంబాసిడర్లుగా దీపికా పదుకొనే, పీవీ సింధు

Deepika

ఈ దీపావళి సందర్భంగా భారత్ కీ లక్ష్మి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు చేరుకున్న అమ్మాయిలను గౌరవించుకునేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ వీడియో ద్వారా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట లక్ష్మీదేవత కొలువుదీరి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని మోదీ అన్నారు. ఇక “భారత్ కీ లక్ష్మి” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, స్టార్ షట్లర్ పీవీ సింధు నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మహిళా సాధికారతను, మహిళల కృషిని చాటే ఉద్దేశంతో భారత్ కీ లక్ష్మి హ్యాష్‌ట్యాగ్‌తో దీపికాపదుకొనే, పీవీ సింధు ఓ వీడియో రూపొందించారు. అనాథలకు అమ్మగా పేరున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతై సప్కాల్ లాంటి వారిని గుర్తు చేస్తూ..ఇలాంటి లక్ష్మిలు ఉన్న ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని వీడియోలో పీవీ సింధు, దీపికా పదుకొనే చెప్తున్నారు.

Related posts