telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మృతదేహాలకు కరోనా పరీక్షలు..హైకోర్టు ఆదేశం

Corona

మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ… శవాలకు పరీక్షలు చేయకపోతే కరోనా కేసులు మూడో స్టేజికి చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో చోటుచేసుకున్న ఘటనలను లాయర్ ప్రభాకర్ వివరించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో చనిపోయిన తర్వాత డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తే కరోనా బయటపడిందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను హైకోర్టుకు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పాటిస్తోందో ఈ నెల 26న నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

Related posts