బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రలలో “దేదే ప్యార్ దే” అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అకివ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు అజయ్ దేవగన్ బర్త్ డే సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆశిష్ (అజయ్ దేవగన్), అయేషా (రకుల్ ప్రీత్ సింగ్) జీవితంలో జరిగిన సంఘటలను ఫన్నీగా ట్రైలర్లో చూపించారు. అజయ్ (50) మరియు అయేషా (26) లండన్లో ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు ఇంటికి తిరిగి రాగా… అక్కడ జరిగే జర్నీ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక పెళ్ళైన, తనకంటే వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తిని లవ్ చేసే పాత్రలో నటించింది. ఈ ట్రైలర్ లో రకుల్ ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్, అలోక్ నాథ్ కీలక పాత్రలలో రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post
చైనా యాప్స్, దేశభక్తిపై సంచలన వ్యాఖ్యలు… వర్మ ఓపెన్ ఛాలెంజ్