telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

నైన్త్ క్లాస్ చదివే వయసులో ప్రేమ.. ప్రియుడి కోసం తండ్రిని హత్య చేసిన కూతురు

New couples attack SR Nagar

ప్రియుడి కోసం కన్నా తండ్రినే హత్య చేసింది ఓ కూతురు. తొమ్మిదవ తరగతి చదివే వయసులో ప్రేమలో పడి ప్రియుడితో కలిసి తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. పకడ్బందీగా కుట్ర పన్ని తండ్రిని చంపేసిన ఆ అమ్మాయిని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. ఇంతకీ అమ్మాయి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాజాజీనగర ఐదో బ్లాక్‌ లో ఓ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఆయనకు నైన్త్ క్లాస్ చదివే కుమార్తె ఉంది. ఆమె తన ఇంటికి సమీపంలోనే ఉంటూ బీకామ్ చదువుకుంటున్న ప్రవీణ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. ప్రవీణ్ పదేపదే తమ ఇంటికి రావడాన్ని చూసిన ఆమె తండ్రి వారించాడు.

దీంతో ఆ బాలిక తండ్రిపై కోపం పెంచుకుంది. అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. నిద్రమాత్రలు కలిపిన పాలను తండ్రికి ఇచ్చింది. తండ్రి నిద్రపోతుంటే, ప్రియుడైన ప్రవీణ్ ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ఆయన్ను విచక్షణారహితంగా గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచారు. మృతదేహాన్ని బాత్ రూమ్ లో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, కొంత పెట్రోల్ వారిపైనా పడటంతో మంటలు విస్తరించాయి.దీంతో బాలిక కేకలు పెట్టింది. చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పి, గాయపడ్డ ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. తొలుత తాము బయటకు వెళ్లి టిఫిన్ చేసి వచ్చేసరికి మంటలు అంటుకున్నాయని చెప్పిన ఆమె, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts