telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పర్చూరు నుంచి హితేశ్‌కు బదులుగా దగ్గుబాటి!

Daggubati ysrcp candidate from parchur

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావుతో పాటు అతని కుమారుడు హితేశ్ చెంచురామ్‌ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేశ్ చెంచురామ్‌ని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. ఆ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత దగ్గుబాటి, హితేశ్‌లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే హితేశ్‌కు అమెరికా పౌరసత్వం కలిగి ఉంది.

భారతదేశ ఎన్నికల్లో పోటీ చేయాలంటే విదేశాల్లో ఉన్న పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. హితేశ్ పౌరసత్వ రద్దుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇంకా ఆ ప్రక్రియ పూర్తికానందున హితేశ్‌కు బదులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పరుచూరు నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అధినేత జగన్ కోరారు. దీనికి దగ్గుబాటి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Related posts