telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా భారిన దగ్గుబాటి పురందేశ్వరి!

purandeshwari bjp

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులతో పాటు పలువురు నేతలు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమెహైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌-19 సోకిందని వైద్యులు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది. తనకు కరోనా సోకిన విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె కాసేపటి క్రితం ట్వీట్ చేయడం గమనార్హం.

Related posts